మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ ఆర్ పి సి హెచ్ పి నందు టీబీజీకేఎస్ కార్మిక సంఘానికి ఫిట్ సెక్రెటరీగా నూతనంగా ఎన్నికైన కే శ్రీనివాస్ చారికి సింగరేణి బొగ్గుగని కార్మికుల యూనియన్ సభ్యులు డి నరసయ్య మోతే రాయల్ తిరుపతి రెడ్డి ,రమేష్ షణ్ముఖ చారి , కోటేశ్వరరావు, దుండ్రసదానందం (క్వాలిటీ సూపర్వైజర్) , నారాయణరావు ,జే ప్రభాకర్ సురేష్, క్లరికల్ ఉద్యోగులు మరియు ఇతర శాఖల కార్మికులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుండ్ర సదానందం మాట్లాడుతూ భూగర్భంలో ప్రకృతి విరుద్ధ ప్రాంతంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల శ్రమ, త్యాగాలే గొప్పవి.కార్మికుల హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి అని , యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి తెలియజేశాడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైంది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడింది అని తెలియజేశాడు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more