మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more