సమస్థ వర్గాల సంక్షేమ బడ్జెట్ ఇది
సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసిన రాష్ట్ర బడ్జెట్తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు
అంకెల గారడిగా కాకుండా మానవీయతతో కేటాయింపు ప్రతిపాదనలు ఉన్న బడ్టెట్. ప్రజల కలలను సాకారం చేస్తూ సజీవ ఆర్థిక ప్రణాళికల బడ్టెట్
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తయారి ప్రక్రియ, కేటాయింపుల్లో ప్రాధామ్యాలను నిర్దేశించుకొని సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు అనే అంశంపై జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహింపబడిరది. ఈ కార్యక్రమానికి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్
డా॥ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పలువురు బీసీ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమం కాచిగూడలోని ఒక ప్రయివేట్ హోటల్లో నిర్వహించారు.
డాక్టర్ వకుళాభరణం తన ప్రసంగంలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, విశ్లేషణలను ఇక్కడ అందచేస్తున్నాం….. బడ్జెట్ రూపకల్పనలో అన్ని నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయో, సంక్షేమాలే గీటురాయిగా స్వీకరించింది. ఆ స్ఫూర్తితోనే ప్రభుత్వం మూడు ప్రాధామ్యాలను గుర్తించి ఆచరణలోకి తెచ్చింది. అందులో మొదటిది బలహీన వర్గాల సంక్షేమం. రెండవది వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలు. మూడవది పారిశ్రామిక రంగం. ఈ మూడు సాధిస్తూ ఆచరణలో ముందుకు సాగుతున్న క్రమం ఈ బడ్జెట్లో స్పష్టంగా గమనించవచ్చు. గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో అభివృద్ధి ఎంత వేగంగా ముందుకు సాగుతుందో ఈ బడ్జెట్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
స్పష్టమైన భవిష్యత్ దర్శనం, కొంగొత్త వ్యూహాలతో అభివృద్ధి ప్రతిఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వ విత్త సమగ్ర ప్రణాళికా క్రమాన్ని ఈ బడ్జెట్లో చూడవచ్చు. ఉన్నవనరులను, అవసరాల మధ్య సక్రమంగా కేటాయింపులు జరిపి, తలసరి ఆదాయాన్ని మానవ అభివృద్ధి సూచీని పెంచడంలో ఈ బడ్జెట్ కీలకపాత్ర పోషిస్తుంది. వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలనేది లోకోక్తి. ప్రభుత్వాధినేత కెసిఆర్ తాను కలలుకంటున్న ‘‘బంగారు తెలంగాణ’’ ను సాధించే క్రమంలో అనేక వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ, దృఢంగా ముందుకు అడుగులు వేసారు. ఆర్థికశాస్త్ర పితామహుడు కౌటిల్యుడికి ఉన్న రాజనీతిజ్ఞత, భవిష్యత్ అవసరాలకై నాటి అశోక చక్రవర్తికి ఉన్నంత దార్శనికత, ఇంటిని చక్కబెట్టుకొనే సగటు ఇల్లాలుకు ఉండే ఇగురం ఈ మూడిరటి మేలైన కలయికగా బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ. ముందుకు సాగడం వలననే ఇంతటి ఊహించని ప్రగతిని ప్రభుత్వం సాధించగలిగిందని చెప్పవచ్చు.
అంకెల గారడిగా కాకుండా ప్రజలను కేంద్రంగా ప్రణాళికలు, బడ్జెట్లు రూపొందిస్తూ ఉండడం. వలన గతంలో ప్రభుత్వం ముందున్న చాలా సవాళ్లు, విచ్ఛిన్నమైన, విద్వంసమైన తెలంగాణ సమాజాన్ని తలెత్తుకుని నిలబడేలా చేయడానికి గంభీరమైన లక్ష్యంతో ముందుకు సాగడం వలనే తక్కువ సమయంలోనే తెలంగాణ దేశానికి మార్గదర్శిగా నిలబడగలిగింది అని తన సుధీర్ఘ ఉపన్యాసంలో పైన పేర్కొన్నవిధంగా లోతైన విశ్లేషణను విఫులంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు వ్యక్తం చేశారు.