నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మాజీ జేసీ సత్తయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వివాహ బంధం పరస్పర నమ్మకం, ప్రేమాభిమానాల పునాది పై నిలబడే పవిత్రమైన అనుబంధమని పేర్కొన్నారు. అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ పలకరింపులు, శుభాకాంక్షల మధ్య ఆత్మీయంగా
కొనసాగింది.