తొలితరం సినీ విమర్శకుడు వి.ఎ.కె.రంగారావుకు ‘‘ఆకృతి పురస్కారం’’
అలనాటి సినీ విమర్శకుల్ల్లో అగ్రజుడు రంగారావు
` డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు
తన విశ్లేషనలు విమర్శణా వ్యాసాలతో అలనాటి తెలుగు చలన చిత్రాలను ప్రభావితం చేసిన దిగ్గజ సినిమా పాత్రికేయుడు వి.ఎ.కె.రంగారావు సేవలు వెలకట్టలేనివని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. ముక్కుసూటిగా, ఖచ్చితత్వంతో ఆయన రాసిన సినీ విమర్షలు నాటి అగ్రనటులుగా వెలుగొందిన ఎన్టిఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్బాబు మున్నగువారి ప్రసంసలు అందుకున్న వారిలో రంగారావు ప్రముఖుడని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు.
శుక్రవారంనాడు స్థానిక లక్డీకాపూల్, లోని ఎస్.ఎస్.ఆర్ ఛాంబర్స్లో ఆకృతి సాంస్కతిక సంస్థ తొలితరం సినిమా, సాహిత్య, సంగీత విమర్షకులు, విశ్లేషకుడు వి.ఎ.కె.రంగారావు(85)ను ఘనంగా సన్మానించింది. దుష్షాలువాలు, పూలమాలలతో సత్కరించి ఆకృతి ప్రత్యేక పురస్కారంను అందజేసింది. ఈ కార్యక్రమం ఆకృతి అధ్యక్షుడు సుధాకర్ నిర్వాహణలో జరిగింది. కవయిత్రి శశిబాల తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా జరిగిన అభినందన సభలో ముఖ్యఅతిథి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ప్రసంగిస్తూ....రంగారావు విమర్షణా వ్యాసాలు నాటి సినిమాలలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుకొనేవిధంగా ప్రభావితం చేశాయన్నారు. సినిమా సాహిత్యంపైననే కాకుండా నటీనటుల నటనపైన పాటల సాహిత్యంపైన సంగీతంపైన దొర్లిన పొరపాట్లను నిష్పక్షపాతంగా ఎత్తిచూపే ఆయన విమర్శలు ఎన్నో ఆనిముత్యాల్లాంటి సినిమాలు రావడానికి ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. 85 ఏళ్ళ వయస్సులో కూడా, ఆరోగ్యసమస్యలు ఎదురౌతున్నప్పటకీి ఇప్పటికీి అనేకమంది దర్శక, నిర్మాతలకు ఆయన నిస్కర్షగా సూచనలు చేస్తుండడం అభినందనీయం అన్నారు. ఎంతో అమూల్యమైన పాత సినిమాల గ్రామ్ ఫోన్ రికార్డులను సేకరించి పెట్టడం సినిమా రంగం పట్ల ఆయనకున్న నిబద్దతకు నిదర్శనం అన్నారు. అలాంటి రంగారావుగారిని చెన్నైనుండి హైదరాబాదుకు ఆహ్వానించి, సన్మానించడం సముచితంగా ఉందని పేర్కొన్నారు.
రంగారావు మాట్లాడుతూ....తన సలహాలు కావాల్సినవారు కోరితే సహకరించడానికి ఎల్లవేళల అందుబాటులో ఉంటానన్నారు. ఇప్పటి సినిమాలలో చిత్రీకరణలో సాంకేతికత గొప్పగా
ఉపయోగించడం కొత్తపరిణామం అన్నారు. కాగా చిత్రీకరణలో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకోగలిగితే మరింతగా ఉన్నత ప్రమాణాలు కల్గిన ఉత్తమ చిత్రాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.