డాక్టర్ వకుళాభరణంకు మహాత్మా పూలే పురస్కారం.
****23వ మహా సభలో డాక్టర్ వకుళాభరణంకు పురస్కారం అందజేసిన తానా.
23 వ తానా మహాసభలలో ఈసారి సామాజిక న్యాయ కోణంలో బహుజన వాదం పై సమాలోచనలు నిర్వహించడం, గొప్పగా ఉందని ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒకటే అని చాటి చెప్పి,సమైక్య పూరితంగా నినదించడంలో తానా మహాసభలు నిదర్శనం గా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.భారత కాలమానం ప్రకారం 10 వ తేదీ ఉదయం 5 గంటలకు ఆరంభమైన తానా మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. తానా ఆహ్వానం మేరకు అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరిగిన ఈ సభలకు ఆత్మీయ అతిథిగా డాక్టర్ వకుళాభరణం పాల్గొన్నారు. ఆయన నిర్విరామ కృషిని గుర్తిస్తూ ఈ సందర్భంగా తానా మహాత్మా పూలే పురస్కారం ను అందజేసింది.ఈ పురస్కారం తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు,ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర చేతుల మీదుగా ఆయన స్వీకరించారు.ఈ సందర్భంగా అక్కడ జరిగిన భారీ సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ ఈ సభలు తెలుగు జాతి ఔన్నత్యం, ఔచిత్యం సమున్నతంగా ఆవిష్కరించాయి అని అన్నారు.సమస్త నిమ్న వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన వృత్తిదారులగురించి ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన బహుజన శతకం పుస్తకాన్ని ఆవిష్కరింప జేయడం గొప్పగా ఉంది అని ఆయన అన్నారు.ఇలాంటి వైవిధ్య సరళిని అవలంబించి,ఆచరించి తానా కొందరిది కాదు అందరిదీ అని నిరూపించుకుందని ఆయన పేర్కొన్నారు. ఇంతటి విశ్వ వేదికపై తనకు మహాత్మా పూలే పురస్కారం అందజేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంచుకున్న రంగంలో పని చేసుకుంటాయి పూట తప్పక సమాజం సముచితంగా గౌరవిస్తుంది అనడానికి ఈ పురస్కారం లభించడమే గొప్ప నిదర్శనం అని ఆయన అన్నారు.తానాకు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more