ధనుష్, రజినీకాంత్ కూతురు ఐష్వర్య లకు 2004 నవంబర్ 18న పెళ్ళి జరిగింది. అప్పట్లో రజినీకాంత్ వారి ప్రేమ ను అంగీకరించి పెద్ద మనసుతో వివాహం జరిపించాడు. ఇప్పుడు వీళ్ళు కూడా సమంత, నాగచైతన్య బాట లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.ధనుష్, ఐష్వర్య లు వారి సోషల్ మీడియా అకౌంట్లలో ఒకే విడాకుల మెస్సేజ్ ను పోస్ట్ చేసారు.
“స్నేహితులుగా, భార్యాభర్తలుగా , తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి జీవించాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా ప్రయాణం కొనసాగించాం. ఈ రోజు ఇరువురివి భిన్నదారులుగా కనపడుతున్నాయి… ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ పరిస్థితులను దాటడనికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి.” అని సొషల్ మీడియాలో ఇద్దరూ ఒకేరకంగా చెప్పుకొచ్చారు.