జూలై 26, 2019: సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ జోన్ స్మైల్ టీం (ఆపరేషన్ ముస్ఖాన్) సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ఎం.డి. ఉమర్ గారి అధ్వర్యంలో ఈరోజు మాదాపూర్ లోని వివిధ వర్తక వ్యాపార సంస్థల్లో సోదాలు చేసి, మైనర్ బాలలను పనికి వినియోగిస్తున్న ఒక హోటల్ (అభిరుచి టిఫిన్స్) మరియు రెండు బైక్ మెకానిక్ షాపుల (రెడ్డి మోటార్స్ మరియు శ్రీ గగన్ సాయి మోటార్స్) యజమానులపై మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేసారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈసందర్భంగా ఎస్.ఐ. ఎం.డి.ఉమర్ గారు వివిధ షాపుల/సంస్థల యాజమాన్యానికి బాలలను పనికి వినియోగించడం చట్టపరంగా నేరమని అందుకు వారు పోస్కో చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, బాలల హక్కుల చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలలు ఈవయస్సులో ఉండాల్సింది బడిలో కాని పనిలో కాదని షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతే కాకుండా ఎవరైనా బాలలను నిర్భంధంగా పనుల్లో వినియోగిస్తున్నట్టు తెలిస్తే బాధ్యత కలిగిన పౌరులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more