• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా

AdminbyAdmin
04/03/2018
inIndia, News, North East, Politics
0
north east bjp wins elections

ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా

రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ మరోసారి తన విజయపరంపరను కొనసాగించింది. ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో తన సత్తా చాటింది. త్రిపురలో తమ సైద్ధాంతిక ప్రత్యర్థి సీపీఎంను దెబ్బతీసి పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ, నాగాలాండ్‌లో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కు పావులు కదుపుతున్నది. ఎవరికీ సంపూర్ణ మెజా రిటీ రాని మేఘాలయలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా మని చెబుతున్నది. ఇప్పటికే దేశంలోని 29 రాష్ర్టాలకు 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈశాన్యంలో సైతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఆ పార్టీ చేతిలో ఉండగా, తాజాగా త్రిపుర, నాగాలాండ్‌తోపాటు మే ఘాలయ కూడా దాని ఖాతాలో చేరనున్నట్టు తెలుస్తున్న ది.అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత, ప్రాంతీయ పక్షాలతో పొత్తులు బీజేపీకి అనూహ్య ఫలితాలను తెచ్చిపెట్టాయి. త్రిపుర, నాగా లాండ్‌లో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా లభించలేదు.

Modi-Shah BJP‘‘త్రిపుర ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి’’.. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు సీపీఎం నేత సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలివి! శనివారం వెలువడిన ఫలితాలతో ఆయన మాటలు నిజమేననిపిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోకి తీసుకురావడం వంటి పలు నిర్ణయాలతో దేశవ్యాప్తంగా కొంత వ్యతిరేకత ఉందని.. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇటీవల రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘ఇది మార్పునకు సంకేతం’ అనీ పేర్కొన్నారు. అయితే తాజాగా మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో జరగ్గా.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతైంది.

పాతికేళ్లుగా త్రిపురలో అధికారంలో ఉన్న వామపక్షాలను చిత్తుగా ఓడించి బీజేపీ అధికారం సాధించడం, త్రిపుర, నాగాలాండ్‌లలో కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకుపోవడం దేశవ్యాప్తంగా కాంగ్రె్‌స, ఇతర ప్రతిపక్షాలను ఆందోళనలో పడేసింది. దీన్నొక చరిత్రాత్మక విజయంగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. త్రిపురలో వచ్చిన ఊపు కర్ణాటకలోనూ పని చేస్తుందని విశ్వసిస్తున్నాయి.
నిజానికి కర్ణాటకలో పరిస్థితులకు త్రిపురలో ఉన్న పరిస్థితికీ తేడా ఉన్నప్పటికీ బీజేపీకి దేశంలో తిరుగులేదన్న భావన కర్ణాటక ప్రజల్లో కలగజేసేందుకు ఆ పార్టీ యథాశక్తి ప్రయత్నిస్తుంది. బీజేపీ పథకం ప్రకారం దేశమంతా విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఉత్తరాది, మధ్య భారత్‌, పశ్చిమ భారత్‌ను జయించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించిందని.. దక్షిణాదిన ప్రవేశించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

Tags: Elections
Admin

Admin

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
News

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

by Admin
18/03/2026
0

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Read more
ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

16/03/2026
బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

13/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News