• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

హైదరాబాద్ మెట్రోరైల్: అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణం ప్రారంభo

TP NewsbyTP News
21/03/2019
inFeatured, Hyderabad, News
0
Hyd Metro Hi-tech city

హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రోరైలు మార్గంలో ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో తాజా మార్గంతో కలుపుకొని 56 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్టయింది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోరైల్ అవతరించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హైటెక్‌సిటీకి మెట్రోరైలు అందుబాటులోకి రావడంపై జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఐటీ, ఇతర ఉద్యోగులు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హైటెక్‌సిటీకి వెళ్లే మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం అదే రైల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మెట్రో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రయాణించారు.

అమీర్‌పేట నుంచి ప్రారంభమైన రైలు 20 నిమిషాల్లో హైటెక్‌సిటీ స్టేషన్‌కు చేరుకుని, తిరిగి అదే ట్రాక్‌పై తిరుగుప్రయాణంలో 18 నిమిషాల్లోనే అమీర్‌పేటకు చేరుకుంది. అనంతరం సాయంత్రం నాలుగుగంటల నుంచి ప్రయాణికులను అనుమతించారు. ఇతరమార్గాల మాదిరిగానే ఉదయం 6.15 గంటలకు ప్రారంభమై రాత్రి 10.30 గంటలకు చివరి మెట్రో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఒకటవ కారిడార్‌కు సంబంధించి ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మధ్య (29 కిలోమీటర్లు), మూడో కారిడార్‌లో నాగోల్ నుంచి అమీర్‌పేట (17 కి.మీ.) వరకు గల మార్గాల్లో ప్రజలు ప్రయాణిస్తున్నారు. మూడో కారిడార్‌లో ఇప్పుడు అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని గవర్నర్ ప్రారంభించారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మరికొంత మార్గం నిర్మాణంలో ఉన్నది. తాజా ప్రారంభమైన మార్గంలో ఉన్నత ఆదాయవర్గాల నివాసాలు ఉండటంతోపాటు ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నగరం నలుమూలల నుంచి హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాలకు వస్తున్నందున ఈమార్గానికి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.

Tags: Hyderabad Metro Rail
TP News

TP News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

by Admin
07/06/2026
0

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్‌లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్‌కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...

Read more
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

16/05/2026
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News