హైదరాబాద్: లాక్ డౌన్ అంశంపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడించాలని రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు. అయితే, లాక్డౌన్ సమయాన్ని సడలించారు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ఉన్న సడలింపు సమయాన్ని ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు అందరూ ఇళ్లకు చేరుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more