తెలంగాణ రాష్ట్ర బి. సి. కమిషన్ ఈ నెల 25 నా బుధవారం నాడు కర్ణాటక లో పర్యటించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బి.సి. రిజర్వేషన్ ల శాతం స్థిరీకరణ, కుల వృత్తుల నవీకరణ, జీవన ప్రమాణాల మెరుగుదల కు తీకుకోవలసిన చర్యలు, చేయాల్సిన సిఫార్సుల నిమిత్తం అధ్యయనం కొనసాగించనుంది. చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సారధ్యం లో సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, శుభప్రధ్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్ ల బృందం కర్ణాటక బి.సి. కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే ఇతర సభ్యుల తో ప్రత్యేకంగా సమావేశం కానుంది. గతంలో కర్ణాటక బి.సి. కమిషన్ లు చేపట్టిన కుల గణన వివరాలను, అవలంభించిన పద్ధతులను, విధి విధానాలను కూలంకశంగా చర్చించనున్నది. ఇందుకు సంబంధించిన సమాచార సేకరణ ను కూడా చేస్తుంది. ఈ సమావేశం నెo. 16- డి, 2 వ అంతస్తు, డి. దేవరాజ్ ఆర్స్ భవన్, మిల్లర్స్ ట్యాంక్ బెడ్ ఏరియా, వసంత్ నగర్, బెంగళూరు లో గల కర్ణాటక బి.సి. కమిషన్ కార్యాలయం లో జరగనున్నది.
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్ అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధన యోగ: జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి యోగను ప్రతి ఒక్కరూ...
Read more



