రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలానికి చెందిన గుట్టల బేగంపేటలొ వినాయక చవితి పురస్కరించుకుని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో సంప్రదాయకంగా నిర్వహించారు .
ఈ యొక్క కార్యక్రమాలలో కులలాకి, మతలాకి, జాతికి, అతీతంగా గుట్టల బేగంపేట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని గుట్టల బెగం పేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది .
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ యువత ఎలాంటి పరిస్థితుల్లోనైనా గట్టిగా నిలబడే శక్తి యువతలో ఉంటుందని, కాలంతో పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ప్రతి యువకుడికి అవకాశం వస్తుందని ఉంటే అలాగే ఉంటుందని అవకాశం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని తెలియజేశాడు .
ఈ సమాజానికి యువత పట్టుకొమ్మ అని ఆత్మ ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచి యువత విజయం వైపు లక్ష్యం వైపు అడుగులు వేయాలని తెలియజేశారు.నేటి విద్యార్థులు రేపటి పౌరులు, యువత దేశానికి త్యాగాలు చేస్తారని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని .మీ ఆలోచన బలంగా ఉంటే బలవంతులుగా తయారవుతారని మీ ఆలోచనా బలహీనంగా ఉంటే బలహీనులుగా తయారవుతారని తెలియజేశారు. ప్రతి యువకుడు ఓటు అనే వజ్ర ఆయుధంగా మార్చుకుని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలని
యువతకు సందేశాన్ని ఇచ్చారు .
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న
గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్,-బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్ ,అఫ్రోజ్ ,బి యాదగిరి ,హరేందర్ ,నరేందర్ కిరణ్, వాసు పాల్గొన్నారు .