• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

AdminbyAdmin
24/07/2026
inNews
0
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బాధ్యులపై తక్షణ సస్పెన్షన్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రముఖ న్యాయవాది, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

గురుకుల విద్యాసంస్థల్లో పదేపదే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. బెల్లంపల్లి గురుకులంలో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, వారిలో ఏడుగురి పరిస్థితి విషమించి మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి రావడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

విద్యార్థినులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, ఆహార నిల్వ విధానాలపై సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు.

ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ కేవలం విచారణలకే పరిమితమై, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందన్నారు. ఈ ఘటనలో బాధ్యులైన అధికారులు, సంబంధిత సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి, స్వతంత్రంగా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, ప్రతి గురుకులంలో ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు.గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రజల్లో ప్రభుత్వంపై అసహనం పెంచుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం చివరికి ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తోందని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఆహార భద్రత, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Admin

Admin

మహిళా సాధికారతకు అద్భుత వేదిక
News

మహిళా సాధికారతకు అద్భుత వేదిక

by Admin
16/08/2026
0

మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...

Read more
మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

16/08/2026
నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

08/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News