త్రిపురకొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ పగ్గాలు చేపట్టనుండటం ఖరారైంది.
అగర్తలాలో మంగళవారంనాడు జరిగిన బీజేపీ, ఐపీఎఫ్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ బర్మన్ పేరు ఖరారైంది.త్రిపుర బీజేపీ విజయం సాధించిన మరుక్షణం నుంచే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విప్లవ్కుమార్ సీఎం రేసులో ముందున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో బనమాలిపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆరెస్సెస్ వలంటీర్గా కూడా విప్లవ్ పనిచేశారు.
బీజేపీకి 35 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)కి 8 వంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 60 మంది సభ్యుల గల అసెంబ్లీకి 59 స్థానాల్లో గత ఫిబ్రవరి 18న ఎన్నిక జరిగింది. సీపీఎం అభ్యర్థి మరణంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
త్రిపురలో తొలిసారిగా బీజేపీ ఘనవిజయానికి 48 ఏళ్ల విప్లవ్ దేవ్ శక్తివంచన లేకుండా కృషి చేయడంతో ఆయనకు సీఎం పదవి వరించింది. గోమతి జిల్లా రాజ్ధర్ నగర్ గ్రామంలో 1971 నవంబర్ 25న మధ్యతరగతి కటుంబంలో విప్లవ్ దేవ్ జన్మించారు. 1999లో ఉదయ్పూర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తండ్రి హరధన్ దేవ్ అప్పట్లో జన్సంఘ్ స్థానిక నేతగా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే విప్లవ్ దేవ్ ఆర్ఎస్ఎస్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. 16 ఏళ్ల పాటు సంఘ్ ప్రముఖ నేతలతో కలిసి పనిచేశఆరు. 2015లో త్రిపురకు తిరిగి వచ్చిన దేవ్ బీజేపీలో పనిచేశారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. దేవ్ భార్య నీతి ఎస్బీఐలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.