యాదాద్రి: యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల లో తృటిలో ప్రమాదం తప్పింది. రాచమల్ల లింగయ్య అనే వ్యక్తి ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి కరెంటు స్తంభం, ఈదురు గాలులకు ఇంటి పై గల రేకుల పైన పడటంతో రేకులు కూలిపోయాయి. ఇంట్లో ఉన్న వారు ప్రమాదాన్నీ గమనించి బయటికి పరుగులు తియ్యడంతో, స్వల్ప గాయాలతో బయట పడటం జరిగింది.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG-20210525-WA0025-840x473.jpg)
ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు స్తంభం పై గల కరెంటు తీగల గుండా కరెంటు సరఫరా జరుగుతున్న కూడా అక్కడ జనం లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG-20210525-WA0028-840x473.jpg)
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG-20210525-WA0030-840x473.jpg)