ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో , ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారికి ఉప్పల్ డివిజన్ న్యూ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం మరియు డ్రైనేజీ కాలనీ సమస్యలపైన వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, వేముల సంతోష్ రెడ్డి, న్యూ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాడిగే శేఖర్, జనరల్ సెక్రెటరీ గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్, ఆన్య వెంకటేష్ , టం టం వీరేష్, లక్ష్మీనారాయణ, పల్లె నర్సింగ్ రావు, కొంగల శ్రీధర్, సాయి రాజిరెడ్డి రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more