భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు న్యూ ఢీల్లీలో ఘన నివాళి.
పీడిత వర్గాల కోసం జీవితాంతం నిస్వార్ధంగా పనిచేసిన, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమూల్యమైనవని ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. శుక్రవారం ఉదయం బాబు జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా, న్యూఢిల్లీలోని బాబు స్మారక స్థలం” సమతా స్థల్ “వద్ద పుష్పాలు సమర్పించి,ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం న్యూ ఢీల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలలో కూడా ఆయన పాల్గొని అంజలి ఘటించారు ..
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more