తొలి పలుకు: శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ లోని మిదికుంట చెరువును సోమవారం రోజు ఇరిగేషన్ అధికారులు డీ ఈ నళిని, ఏ ఈ పావని లు పరిశీలించారు. సర్వే నెంబర్ 44/5 మరియు 139 ల మధ్యనున్న ప్రభుత్వ భూమిని సర్వే చేసి ,హద్దు బంధులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. త్వరలోనే కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కుంటను కబ్జా కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆర్ ఐ శీనయ్య కు ఫోన్ లో పలు సూచనలు చేశారు. జాయింట్ సర్వే చేసి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, కట్ట పై నుండి యధావిధిగా దారిని పునరుద్ధరించాలని గతంలోనే కలెక్టర్కు ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వోకు మరియు జోనల్ కమిషనర్, చందానగర్ సర్కిల్ 21 జి హెచ్ ఎం సికమిషనర్ కు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ పట్టిచుకోకక పోవడం పై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కలిసి విన్నవించడంతో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్ కు లెటర్ రాసి, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి కబ్జా కాకుండా చూడాలని కోరినట్లు బిఅరెస్ కార్మిక విభాగం నాయకులు టి. సంతోష్ రెడ్డి, బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.కృష్ణ పటేల్, బి.కె. ఎన్ క్లేవ్ లు మాజీ అధ్యక్షులు కె. పాపిరెడ్డి లు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more