“వచ్చే జనాభా లెక్కల్లో కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం” – డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
వచ్చే జనాభా లెక్కల్లో కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“2011లో జరిగిన సామాజిక–ఆర్థిక కుల గణాంక సర్వే (SECC-2011) గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో చేపట్టినప్పటికీ, ఆ గణాంకాలు పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదు. అయితే ఈసారి, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జనాభా లెక్కల విభాగం (Census Department) ద్వారా కుల గణనను నిర్వహించబోతోంది,” అని డా. వకుళాభరణం తెలిపారు.
విజ్ఞాన ఆధారంగా విధానాలు – శాశ్వత పరిష్కారానికి మార్గం
ఈ గణాంకాల ద్వారా ప్రభుత్వాలకు శాస్త్రీయంగా ఆధారపడిన విధానాలు రూపొందించేందుకు అవకాశం కలుగుతుంది.
• రిజర్వేషన్ల విస్తరణకు quantifiable మరియు justifiable dataగా ఇవి ఉపయోగపడతాయి.
• ప్రజాపాలనలో సమతా విలువల బలోపేతానికి, సామాజిక న్యాయానికి ఇది దోహదపడుతుంది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో…
ఈ గణాంకాలు అందుబాటులోకి వచ్చేనాటికి – నిరంతర పర్యవేక్షణ, లక్ష్యమయిన నడత, బీసీలకు ప్రత్యేక సంక్షేమ పథకాల రూపకల్పన, అవసరమైన నిధుల కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక అమలులో ముందడుగు వంటివాటికి మార్గం సుస్పష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్లో ఈ అంశాలన్నింటికీ సమగ్ర సమన్వయంగా పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక OBC మంత్రిత్వ శాఖ (Ministry for OBCs) ఏర్పాటు చేయాలని డా. వకుళాభరణం కోరారు.