జపాన్: జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం ఆకాంక్షించారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more