జపాన్: జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం ఆకాంక్షించారు.
నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...
Read more