హైదరాబాద్: క్యూ న్యూస్ ఛానల్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలగూడ ఠాణాలో నమోదైన కేసులో భాగంగా తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సీతాఫల్మండి డివిజన్ మధురానగర్కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహకుడి ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసును నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని జ్యోతిషాలయం నిర్వహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేశాడని పోలీసులకు తెలిపాడు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


