హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీమతి సురభి వాణీదేవి శాసన మండలిలోని ప్రొటెం చైర్మన్ చాంబర్లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more