సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ కోనంపేట్ వడ్డేపల్లి సాదుల్ నగర్ చింతలచెరువు సమీపంలో నిర్మిస్తున్న సురభి కెమికల్ ఫ్యాక్టరీ గ్రామస్తుల ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నదని ఫ్యాక్టరీ నీ ఎత్తివేయాలని గ్రామస్థులు ధర్నా చేస్తు 81 వ రోజు దాటిన పట్టించుకోకపోవడం పై సర్వత్రా విమర్శలకి దారితీస్తుంది తెలిపారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ పై వెంటనే చర్యలు తీసుకోని ప్రజలకు న్యాయం చేయాలని ముచ్చర్ల గణేష్ యాదవ్ అధికారులను కోరారు.మరియు ఖానాపూర్ లో అసైన్డ్భములను కబ్జా చేసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే సురభి కెమికల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దుచేయాలని ధర్నాలొ పాల్గొనడం జరిగింది.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more