కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , GHMC అధికారులతో కలిసి జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ లోని ప్రతీ గల్లీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నాం, వర్షాలు కురిసినా నీరు నిలువకుండా,బస్తి వాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేస్తాం అని అన్నారు. అలాగే నాణ్యతా పరిమానాలతో పనులను పూర్తి చేయాలని సంబంధిత కంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నజీర్, నూర్ ఖాన్, పర్వీన్ సుల్తానా, యోగిరాజు స్వామి, తదితరులు పాల్గున్నారు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


