కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , GHMC అధికారులతో కలిసి జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ లోని ప్రతీ గల్లీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నాం, వర్షాలు కురిసినా నీరు నిలువకుండా,బస్తి వాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేస్తాం అని అన్నారు. అలాగే నాణ్యతా పరిమానాలతో పనులను పూర్తి చేయాలని సంబంధిత కంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నజీర్, నూర్ ఖాన్, పర్వీన్ సుల్తానా, యోగిరాజు స్వామి, తదితరులు పాల్గున్నారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


