యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం (32) మృతి చెందాడు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు అయితే ఈ రోజు తన సమీప బంధువుల శుభకార్యానికి హాజరై వృత్తి రీత్యా హైద్రాబాద్ కి తిరుగు ప్రయణమవ్వగా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి లో లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
