యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం (32) మృతి చెందాడు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు అయితే ఈ రోజు తన సమీప బంధువుల శుభకార్యానికి హాజరై వృత్తి రీత్యా హైద్రాబాద్ కి తిరుగు ప్రయణమవ్వగా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి లో లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more