తొలిపలుకు న్యూస్ (ప్రగతి భవన్) :మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి గౌడ కులస్తులకు 15 శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎక్సైజ్ శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గౌడులు సీఎంకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సత్కరించాలని ఆశించిన మంత్రికి ప్రతిగా సీఎం శాలువా కప్పి సన్మానించారు. ‘‘కల్లుగీత వృత్తి గౌడకులంలో పుట్టిన బిడ్డవు నీకే నేను సన్మానం చేయాలె’’ అంటూ శ్రీనివాస్ గౌడ్ ను సీఎం అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ఈ దేశంలో కుల వృత్తులను ప్రోత్సహించడం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. ఇప్పటికే నీరా అమ్మకాలను కేవలం గౌడ కులస్థులకు మాత్రమే కేటాయించి చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం, మద్యం దుకాణాల్లో గౌడులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టారన్నారు, వ్యాపారాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ దళిత బహుజనులకు ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ నాటి సర్వాయి పాపన్న ఆశయాలను సీఎం తీర్చుతున్నాడని కొనియాడారు. చిత్రంలో మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే జాజల సురేందర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులున్నారు.