ముంబాయి: కరోనా సంక్షోభంలో బాధితులకు కొండంత అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సివిల్ సర్వీసులో చేరాలని కలలుకనే ఐఏఎస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు ‘సంభవం’ పేరిట ఓ కొత్త ప్రయత్నం మొదలు పెట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఐఏఎస్ కు ప్రిపేర్ కావాలని అనుకొంటున్నారా? మీ బాధ్యత మేము తీసుకుంటాం’ అంటూ ట్విటర్లో ఆయన ప్రకటించారు. అభ్యర్థుల దరఖాస్తులకు జూన్ 30 గడువుగా వెల్లడించారు. దీనికోసం అభ్యర్థులు ముందుగా www.soodcharityfoundation.org వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ‘రేపు జీవితంలో మీరు ఆర్థికంగా స్థిరపడినపుడు మీ జీవనశైలి పెంచుకోవాలని చూడకండి.. ఇతరులకు ఇవ్వడం ద్వారా వదాన్యత పెంచుకోండి’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు.
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు
బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more