ప్రభుత్వం అనుమతితో నగరంలో ఐటీ కార్యాలయాలు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. 33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పెరిగాయి. కాగా కార్యాలయాలకు వస్తున్న సిబ్బంది నిబంధనలు పాటించాలని, మాస్కులు, శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more