పీర్జాదిగూడ : ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గల 5వ డివిజన్ లో పదిహేను రోజుల నుండి, ప్రతి కాలనీలో సోడియం క్లోరైడ్ పిచికారి చేసినందుకు మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి గారు దేశగొని శ్రీనివాస్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి శాలువాతో సన్మానం చేసినారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ దుబ్బాక జైహింద్ గౌడ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు దుబ్బాక వెంకటేష్ గౌడ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు కట్టా ఆంజనేయులు గౌడ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు బద్దంమల్లారెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షులు ఎర్ర నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగే ఇంకా మంచి సేవ కార్యక్రమాలు చేయాలని శ్రీ దేశగొని శ్రీనివాస్ గౌడ్ గారిని మంత్రి గారు ప్రశంసించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more