నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ పార్క్ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డ్ కమిటీ సమీక్ష సమావేశంలో, మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కమిషనర్ శ్రీ గోపి ఐఏఎస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఆయా
కాలనీలలో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కాలనీ మరియు కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఎల్లపుడూ కృషి చేస్తామని వారికి తెలిపారు. అదే విధంగా 7వ విడత తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి వాటిని ఎప్పటికప్పుడు సంరక్షించు కోవాలి అని సూచించారు.

ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి , కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి, స్థానిక తెరాస నాయకులు,ఎలక్ట్రికల్ AE గారు,HM &WS మేనేజర్, వార్డు స్పెషల్ ఆఫీసర్ మరియు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు,మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.