ప్రగతి భవన్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more