ప్రస్తుత సమాజంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల కారణంగా విద్యార్ధులపై టి.వీ.లు, సినిమా, నెట్, సెల్ఫోన్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో వారికి భోధన చేయడం ఉపాధ్యాయులకు కష్టంగానే ఉంటుంది. అయితే వాటి ప్రభావం నుండి విద్యార్ధుల దృష్టిని మళ్ళించడానికి నేను గత కొన్ని సంవత్సరాలుగా సాంఘికశాస్త్ర భోధనలో అనేక ప్రయోగాలు చేస్తూ… విద్యాభోధనలో ముందుకు సాగుతున్నాను. ఉదా : మాక్ పార్లమెంట్, మాక్ అసెంబ్లీ, చర్చా వేదికలు, క్షేత్రపర్యటనలు, సామాజిక సర్వేలు, క్విజ్లు, నాటకీయకరణ, జనాభా లెక్కలు, సెమినార్లు మొదలగునవి. వీటి ద్వారా విద్యార్ధులను కార్యోన్ముఖులను చేసి చక్కగా అభ్యసించేటట్లు చేస్తున్నాను.
అందులో భాగంగానే భారత రాజ్యాంగంపై విద్యార్ధులకు అవగాహన కల్పించి, విద్యార్ధుల్లో అవగాహనా స్ఫూర్తిని, విలువలను, దాని ప్రాధాన్యతను అంబేద్కర్ కృషిపై అవగాహన తీసుకురావడానికి పాఠశాల రాజ్యాంగ రచన చేసే విధంగా ప్రేరేపించాను. విద్యార్ధులను సరియైన రీతిలో ప్రోత్సహిస్తే వారు ఎంతటి కార్యాన్నైనా చేయగలరని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.
– మురళీధర్.కె, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు.
Source: kinige.com