అవును ఇది నిజం. నైట్ ఫ్రాంక్ అనే సంస్థ చేసిన వెల్త్ రిపోర్ట్ లో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1596 మందితో ముంబై మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సర్వే ఎవరు 225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారో దాని ఆధారంగా ఇవ్వబడింది. మూడు, నాలుగు స్థానాల్లో బెంగళూరు, పూణే లు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం గా హైదరాబాదులో 467 మందికి 225 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండివ్యూజివల్స్-2021 పేరుతో ఈ రిపోర్ట్ విడుదల చేశారు. హైదరాబాదులో టెక్నాలజీతో పాటు డిజిటల్ ఎకానమీ వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ మార్పు కనిపించిందని నైట్ ఫ్రంట్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా తెలిపారు. 2016 నుండి ఇప్పడి వరకు 28.4% నుంచి 39% కి పెరిగిందని, ఇది అత్యధిక పెరుగుదల శాతం అని పేర్కొంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు కీలక పాత్ర వహిస్తున్నారని ఈ వృద్ధి శాతానికి ఇవి కూడా కారణాలు కావచ్చునని ఆయన తెలిపారు.