హామీని నిలబెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం,కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో, స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం పట్ల హర్షనీయమని జాతీయ బీసీల
దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా, అన్ని రంగాల్లో ఇప్పటివరకు వెనుకబడి ఉన్న బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు 42% శాతం బిల్లును రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లును వ్యతిరేకిస్తే పార్టీలకు రాజకీయ సమాధి చేస్తామని ఆయన హెచ్చరించారు. దేశంలోనే మొదటిసారిగా చారిత్రక బీసీ రిజర్వేషన్ బిల్లు తెలంగాణలో ఆమోదం పొందడం చారిత్రక నిర్ణయం అని ఆయన ప్రకటనలో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రిజర్వేషన్ బిల్లుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ బిల్లు ఆమోదం తదుపరి అమలు కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు .