హీరో ధనుష్, ఐశ్వర్యలు 18 సంవత్సరాల బంధం తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారు సోషల్ మీడియా వేదికగా ఒకే బ్రేక్అప్ మెస్సేజ్ ను పోస్ట్ చేసి వారి అభిమానులకు షాక్కి గురి చేసారు.
అయితే సుచీ లీక్స్ వారిద్దరి బ్రేక్అప్ కి కారణమని కోలీవుడ్ చర్చించుకొంటోంది. కొన్ని సంవత్సరాల కింద వచ్చిన ఈ సుచీలీక్స్ పెద్ద ధుమారమే లేపింది. సింగర్ సుచిత్ర తన ఫేస్బుక్ అకౌంట్ లో అప్పట్లో కొన్ని ప్రయివేట్ ఫోటోలు, వీడియోలూ లీక్ చేయడంతో ఇది స్టార్ట్ అయింది.
అందులో ధనుశ్ తో పాటు త్రిష, హన్సిక, అమలాపాల్, ఆండ్రియా, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. అందులో ధనుశ్ కొందరు హీరోయిన్స్ తో ఉన్న ప్రయివేట్ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ అఫైర్లే గొడవకి కారణమని, ఆ వివాదమే చిచ్చురేపి ఇంతవరకు దారి తీసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు.