ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రాజీనామ చేస్తున్నట్లు ఆయన తన రాజీనామాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు.