తొలిపలుకు న్యూస్ (సిద్దిపేట) :తెలంగాణ రాష్ట్ర, సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి, చెందిన మహిళ, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో 0 పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని హాస్పటల్ నుండి సమాచారం తెలుసుకున్న రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ వెంటనే స్పందించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు కి వెళ్లి బ్లడ్ డొనేట్ చేసినారు. ఇప్పటివరకు 51 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యే వెంటనే డొనేట్ చేసే పోలీస్ సిబ్బందిని పంపించడం జరుగుతుంది. పోలీస్ అధికారులు సిబ్బంది రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టడం మరియు సిద్దిపేట జిల్లా పోలీసులు ఎంతో మందికి స్పూర్తిని నింపుతూ ఆదర్శంగా నిలవడం జరుగుతుంది.
ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న ఆమె యొక్క బంధువులు అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.