బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మూడు విడతలు విజయవంతంగా పూర్తిచేసుకుని 4వ విడత ఈ నెల 12న మొదలు పెట్టారు. కెసిఆర్ నిరంకుశ నియంతృత్వ కుటుంబ పాలనను అంతమోందించేందుకు చేపట్టిన ఈ పాదయాత్ర మొదటి రోజు విజయవంతం చేసుకొని నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆల్బెస్టాస్ కాలనీ లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డీ గారితో పాటు రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్,మరియు కొండాపూర్ డివిజన్ నాయకులు నరేష్ ముదిరాజ్, రమేష్ రెడ్డీ, సాగర్, శ్రీకాంత్, మదన్ అరుణ్ సుకుమార్ తదితరులు ఉన్నారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


