సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణ లో రేపు పాఠశాలల పునప్రారంభం కావల్సి ఉంది.కానీ కరోణా కేసుల పెరుగుదల వలన పలు రాష్ట్రాల బాటలోనే ఇక్కడ కూడా జనవరి 30 వరకు పొడగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి సి.యెస్ సోమేష్ కుమార్ ఒక ప్రకటన లో వెల్లడించారు.
అయితే ఇంతకు ముందే జనవరి 20 వరకు సభలు సమావేశాలు జరుపరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవులకు ఊర్లలోకి వెళ్ళిన వారు అక్కడే ఉండాలా రావాలా అనే సంధిగ్ధం లో ఉండగా, ఈ ప్రకటన చాలామందికి ఒక స్పష్టతనిచ్చింది.