హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వీరాభిమాని దురుసొజ్ సతీషు, రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వస్తే తాను గాంధీ భవన్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారు. సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, వర్ధమానుకోట కు చెందిన వీరాభిమాని.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన సొంత గ్రామం వర్ధమానుకోట లోని ఆంజనేయస్వామి ఆలయంలో రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వస్తే గాంధీభవన్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నట్లు తెలిపాడు ఈ సందర్భంగా శనివారం రోజున ఉదయం ఏడు గంటలకు గాంధీభవన్ నుండి పాదయాత్రగా బయలుదేరిన సతీష్ నాలుగు నుండి ఐదు రోజులలో కొండగట్టుకు చేరుకొని తన ముక్కు తీసుకోనున్నట్లు తెలిపారు అదేవిధంగా రానున్న ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని తన కోరిక అని తెలిపారు