నాచారం: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ లోని సూర్యనగర్ లో బాలాజీ కిరాణం షాప్ యజమాని మంగీలాల్ అక్రమ దారిలో డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిషేధించిన తంబాకు పొగాకు వంటి వివిధ బ్రాండ్లకు చెందిన నిషేధిత గుట్కాను కర్ణాటక నుండి అతి తక్కువ ధరకు తెచ్చి, మల్లాపూర్ లో పలు షాపులకు విక్రయిస్తున్నారు. గుట్కాలు నిల్వ ఉంచిన గోదాం పైన నాచారం పోలీసులు నిన్న రాత్రి 9గంటల ప్రాంతంలో దాడిచేసి లక్షకు పైగా విలువ చేసే గుట్కాలు స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


