తొలిపలుకు న్యూస్ (నిజామాబాద్): తెలంగాణ రాష్ట్ర, టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో, ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రగతి పథంలో ముందుకు సాగాలని కవిత ఆకాంక్షిచారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more