ప్రగతి భవన్ : భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో, సీఎం శ్రీ కేసీఆర్ ను ఇవాళ పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, కమిటీ ఓవర్సీస్ కన్వీనర్ శ్రీ మహేశ్ బిగాల మర్యాదపూర్వకంగా కలిసి, తెలంగాణ ఎన్నారైల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బిగాల కృషిని సీఎం అభినందించారు.
