మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మిని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ డివిజన్ పరిధిలోని కానమేట్ సర్వే నెంబర్. 44/14 నందు గత 30సంవత్సరలుగా ఇజత్ నగర్, వికర్ సెక్షన్ బస్తీలో నివాసముండే ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరు మృతిచెందినా కూడా గత మూడు దశాబ్ధాలుగా ఇదే స్థలంలో అంత్య క్రియలు చేపడుతున్నారని, గౌసియా అజామ్ దస్తగిర్ దర్గా స్థలాని అభివృద్ధి చేయాలని, ఇప్పటికే స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలని మేయర్ ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బ్రమయ్య యాదవ్, తైలి కృష్ణ,రంగ స్వామి, కేశవులు, శశిధర్, నర్సింగ్ నాయక్,సైయ్యద షకీల్,ఎం.డి అమీర్,సైయ్యద రఫిక్, సిరాజ్ హుస్సేన్, మహిళ నాయకులు సీతమ్మ ఉన్నారు..