బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ నియోజకవర్గ బొడుప్పల్ లో ఈరోజు 21 డివిజన్ పరిధిలోని సాయి భవాని నగర్ కాలనీలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ 100kv కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని కాలనీలలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేటట్లు చూడాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ను క్లీన్ గా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AE బలరాం నాయక్, సహకార బ్యాంక్ డైరెక్టర్ జడిగే రమేష్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలుగొండయ్యా , వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి, బ్రాహ్మణ భవన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీవాసులు రాజారావు, యాదిరెడ్డి, అనిల్, శ్రీధర్, సూర్యనారాయణ, మహేశ్వర్,చారి, అంజి రెడ్డి, రవీందర్, సూరిబాబు, రాములు & తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more