ఈరోజు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుంద్ర కుమారస్వామి చేవెళ్ల ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బీసీ సమస్యల పైన మరియు బీసీలకు రాజ్యాధికారం వాటా, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని , పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, పార్లమెంటులో బిల్లు పెట్టాలని, బీసీల కులాల వారీగా జనా గణన చేయాలని పలు సమస్యలు పై మెమోరాండం ఇచ్చారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిసి ల సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఆలిండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్, శివ మరియు ఇతరులు బిసి నాయకులు పాల్గొన్నారు
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more