ఆత్మకూరు (తొలిపలుకు న్యూస్): తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కల్లూరి ఆంజనేయులు, ఈరోజు జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఆత్మకూరు(యం) పోలీస్ స్టేషన్ కి సంభందించిన 13 కేసుల కక్షి దారులతో మాట్లాడి, రాజీ చేయించి కేసులను కొట్టివెయించినందుకు గాను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గండికోట మధు గారు, కల్లూరి ఆంజనేయులుని రివార్డుతో అభినందించారు. ఈ సందర్భంగా కల్లూరి ఆంజనేయులు మాట్లాడుతూ.. కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుంది, ఎవరు కూడా అనవసర ఆవేశాలకు పోయి, ఇతరులకు ఇబ్బంది కలిగించి కేసులపాలు అయ్యి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు అని తెలిపారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more