• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)

TP NewsbyTP News
26/12/2018
inFeatured, India, News
0
nia

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కొత్త మాడ్యూల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాల్లో దారుణాలు వెలుగు చూశాయి. బుధవారం ఉత్తర ప్రదేశ్, న్యూఢిల్లీలలోని 17 చోట్ల నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, రాకెట్ లాంఛర్, ఆయుధ సామగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. హర్కత్ ఉల్ హర్బ్ ఈ ఇస్లామ్ పేరుతో ఏర్పాటైన ఐసిస్ మాడ్యూల్‌ భారతదేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) అలోక్ మిట్టల్ మీడియాకు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు జరిపేందుకు, రాజకీయ నేతలతోపాటు భద్రతా వ్యవస్థలపై దాడులు చేసేందుకు ఈ మాడ్యూల్ సభ్యులు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు.

nia

ఢిల్లీలోని సీలంపూర్, ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా, హాపూర్, మీరట్, లక్నోలలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.7.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 100 మొబైల్ ఫోన్లు, 135 సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, మెమరీ కార్డులతోపాటు దేశవాళీ రాకెట్ లాంఛర్‌‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమోట్ కంట్రోల్ ద్వారా, ఫిదాయీ దాడులు చేయాలని ఈ బృందం ప్రయత్నిస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ బృందం సభ్యులు విదేశీ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకుని, సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. విదేశీ ఏజెంట్ల వివరాలను రాబట్టవలసి ఉందని చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్నవారిలో ఓ సివిల్ ఇంజినీరు, మౌల్వీ, ఓ విద్యార్థి, ఆటో డ్రైవర్ ఉన్నట్లు వివరించారు. మౌల్వీ ముఫ్తీ సొహెయిల్ ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా నివాసి అని తెలిపారు. హర్కత్ ఉల్ హర్బ్ ఈ ఇస్లామ్ పేరుతో ఏర్పాటైన ఐసిస్ మాడ్యూల్‌‌కు సొహెయిల్ నాయకత్వం వహిస్తున్నాడన్నారు.

Tags: ISISTerrorism
TP News

TP News

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి
News

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి

by Admin
20/06/2026
0

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి హైదరాబాద్, కాచిగూడ: దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వ...

Read more
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

07/06/2026
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

16/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News